- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాయంపేటలో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది..

X
దిశ, శాయంపేట: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. కానీ, ప్రస్తుతం మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృధాగా పోతున్న పట్టించుకునే వారే లేరు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో మిషన్ భగీరథ పైపు పగిలి నీళ్లు రోడ్లపైకి వస్తుండడంతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
గ్రామంలో ఉన్న ప్రజలు పలుమార్లు గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు అధికారులు పట్టించుకొని లీకేజ్ని గుర్తించి తాగునీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
Next Story






