మే 5న మంత్రి కేటీఆర్ పర్యటన..

by Disha Web Desk 20 |
మే 5న మంత్రి కేటీఆర్ పర్యటన..
X

దిశ, హనుమకొండ టౌన్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పట్టాభివృద్ది శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మే నెల 5వ తేదీన హన్మకొండ పట్టణంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారులతో కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య , వరంగల్ పోలీస్ కమీషనర్ ఏ.వి రంగనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed