తెలుగు రాష్ట్రాల జాతీయ రహదారుల దిగ్బంధం.. మంద కృష్ణ మాదిగ

by Dishafeatures2 |
తెలుగు రాష్ట్రాల జాతీయ రహదారుల దిగ్బంధం.. మంద కృష్ణ మాదిగ
X

దిశ, హన్మకొండ: ఎంఆర్పీఎస్ వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల రహదారుల దిగ్బంధం చేయాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. హన్మకొండలోని హరిత హోటల్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ చేపట్టిన భరోసా యాత్ర ఎస్సీలకు భరోసా ఇవ్వలేదన్నారు. ఈ నెల 22 నుండి మార్చి 14 వరకు అన్ని మండలాల నుండి రాష్ట్ర రాజధాని వరకు పాదయాత్ర చేయాలని కార్యకర్తలకు సూచించారు. మార్చి 15న ఎంఆర్పీఎస్ స్టూడెంట్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల జాతీయ రహదారులను దిగ్బంధించి నిరసన వ్యక్తం చేయాలని, ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కార్యకర్తలు తరలి రావాలని కోరారు.



Next Story

Most Viewed