విద్యుత్‌ వైర్లు తగిలి వ్యక్తికి తీవ్ర‌ గాయాలు

by velandi.Saikiran |

ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి ఓ వ్యక్తికి తీవ్రమైన గాయాలైన సంఘటన చోటుచేసుకుంది.

విద్యుత్‌ వైర్లు తగిలి వ్యక్తికి తీవ్ర‌ గాయాలు
X

దిశ, కేసముద్రం : ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి ఓ వ్యక్తికి తీవ్రమైన గాయాలైన సంఘటన కేసముద్రం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం, నారాయణపురం గ్రామ పంచాయతీ శివారులోని బోడగుట్ట తండాలో గుగులోత్ యాకూబ్(32) అనే వ్యక్తికి విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అత‌ని పరిస్థితి విషమంగా ఉంది. నిన్ననే 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడి నేలపై పడ్డాయని, ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు గ్రామ‌స్థులు. అంత‌లోనే యాకూబ్ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని పేర్కొంటున్నారు. దీనికి కార‌ణ‌మైన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story