బాధిత కుటుంబాలకు పుట్ట మధు ఓదార్పు

by Dishanational1 |
బాధిత కుటుంబాలకు పుట్ట మధు ఓదార్పు
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంగళవారం పెద్ద పెళ్లి జిల్లా పరిషత్ చైర్మన్ మంథని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధు పర్యటించారు. మండలంలోని వివిధ గ్రామాలలో వివిధ కారణాలతో మృతిచెందిన కుటుంబాల బాధితులను పుట్ట మధు పరామర్శించి ఓదార్చి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. కాటారం మండలం విరపూర్ గ్రామంలో వెనుగంటి తిరుపతిరెడ్డి మరణించగా ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించి రోధిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒడిపిలవంచ గ్రామంలో ఇసునం పోశమ్మ ఇటీవల మరణించగ వారి కుటుంబాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న వవిల్లా గీతను, గుమ్మలపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన సొనపెళ్లి రామక్క కుటుంబాలను పుట్ట మధు పరామర్శించి ఓదార్చారు. బీఆర్ఎస్ యువ నాయకులు జక్కు రాకేష్, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు తోట జనార్దన్, కాటారం సబ్ డివిజన్ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story