రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు సారయ్య మృతి

by Disha Web Desk 11 |
రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు సారయ్య మృతి
X

దిశ, కాటారం: కాటారం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ‘మనం’ రిపోర్టర్ నార సారయ్య హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం వరంగల్, ఆ తర్వాత హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిమ్స్ ఆస్పత్రిలో సారయ్య మరణించడం పట్ల కాటారం జర్నలిస్టులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed