ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య...

by Dishanational1 |
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య...
X

దిశ, కరీమాబాద్: హన్మకొండ నగరంలో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మురారిశెట్టి నాగజ్యోతి బుధవారం హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్నేహితుల వివరాల ప్రకారం జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామం చెందిన ఇంటర్ విద్యార్థిని బుధవారం ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కు హాజరై రాత్రి సుమారు 9 గంటల సమయంలో కళాశాల హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకోగా గుర్తించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించగా వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మురారి శెట్టి మురారి శెట్టి నాగజ్యోతి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఏమి జరిగింది ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story