ఐదు మండలాల్లో రూ. 2.68 కోట్లతో అభివృద్ధి పనులు : మంథని ఎమ్మెల్యే

by Dishaweb |
ఐదు మండలాల్లో రూ. 2.68 కోట్లతో అభివృద్ధి పనులు  : మంథని ఎమ్మెల్యే
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్ రావు, పలిమెల మండలాలకు సీడీపీ పథకం ద్వారా 2కోట్ల 68 లక్షలు 50వేలు మంజూరైనట్లు ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

* కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్ రావు, పలిమెల మండలంలో కొయ్యూరు నాగులమ్మ టెంపుల్, కొండం పేట, అన్సన్ పల్లి, మల్లారం, ధన్వాడ, దామెర కుంట, బయ్యారం, నస్తురుపల్లి, రేగుల గూడెం (దేవరామ్ పల్లి), మేడిపల్లి, అంకుశ పూర్, గుండ్రాత్ పల్లి, విలాసాగర్, మహా ముత్తారం, సింగారం, యామన్ పల్లి, బోర్ల గూడెం, పలుగుల, రాపల్లి కోట, సర్వాయిపేట, మోదేడు, లెంకల గడ్డ కలిపి 22 బస్ షెల్టర్లు నిర్మాణానికి 66 లక్షలు మంజూరయ్యాయి.

* రుద్రారంలో బుడగ జంగము సంఘానికి కమ్యూనిటీ హాల్ 5 లక్షలు, నాచారం లో &, కాలేశ్వరంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ 10 లక్షలు, ఇబ్రహీం పల్లి లో ఈద్గా కమ్యూనిటీ హాల్ 5 లక్షలు, కొత్తపల్లిలో, సూరారం లో, మహా ముత్తారం లో అభయాంజనేయ స్వామి దేవాలయం కమ్యూనిటీ హాల్ లు 15 లక్షలు,

* మహదేవ్ పూర్ లో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల కమ్యూనిటీ హాల్ కు 5 లక్షలు, మరియు నర్సింగాపూర్ లక్ష్మీదేవర కమ్యూనిటీ హల్ లకు 5 లక్షలు, మహాముత్తారం మండలం బోర్ల గూడెం గ్రామంలో బాలాజీ దేవాలయం కమ్యూనిటీ హాల్ 5 లక్షలు, యామన్ పల్లి గ్రామంలో ముదిరాజు సంఘం కమ్యూనిటీ హాల్ 5 లక్షలు, మహాదేవపూర్ లో (క్రిస్టియన్) బెతస్త్ ప్రార్థన మందిరం 5 లక్షలు నిధులు మంజూరయ్యాయి.

కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా సోమవారం ఎఐసిసి కార్యదర్శి,మాజీ మంత్రివర్యులు మంథని నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గజయశంకర్ భూపాలపల్లి జిల్లా కు సంబంధించిన జిల్లా కలెక్టర్ నుండి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి ఐదు మండలాలకు సంబంధించిన 2 కొట్ల 68లక్షల 50 వేల రూపాయల కు సంబంధించిన వర్క్స్ మంజూరు చేసినట్లు శ్రీధర్ బాబు ప్రకటించారు.



Next Story

Most Viewed