వివోఏల సమ్మెకు మద్దతు తెలిపిన హుస్సేన్ నాయక్..

by Disha Web Desk 20 |
వివోఏల సమ్మెకు మద్దతు తెలిపిన హుస్సేన్ నాయక్..
X

దిశ, గూడూరు : గత 5 రోజులుగా వివోఏలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నిర్వహిస్తున్నారు. ఐదవ రోజు సమ్మెలో భాగంగా వీవోఏలకు మద్దతు పలికి చెవిలో పూలు పెట్టుకుని బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వారు అడిగిన న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరారు. వారికి కనీస వేతనం అందించాలని, వారు చేస్తున్న సేవలను గుర్తించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి చెలుపురి వెంకన్న మానుకోట ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాంబాబు నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు మెరుగు మల్లయ్య, గూడూరు మండల ప్రధాన కార్యదర్శి రాసముల్ల వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు పడాల నాగరాజు, వీవోఏ యూనియన్ అధ్యక్షురాలు దారం శ్రీలత, కోశాధికారి మల్లె పోయిన శ్రీలత, క్లస్టర్ బాధ్యులు కళ్యాణ్, లక్ష్మయ్య , సుగుణ, మల్లేష్ లు పాల్గొన్నారు.

Next Story