అంత‌రాష్ట్ర దొంగ‌ల ముఠా అరెస్టు ?

by Disha Web Desk 20 |
అంత‌రాష్ట్ర దొంగ‌ల ముఠా అరెస్టు ?
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : జనగామ జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్, జ్యోతినగర్ కాలనీలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఒక నిందితుడిని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో చోరీలకు పాల్పడిన నిందితులకు సంబంధించిన పలు సీసీ కెమెరా ఫుటేజ్ లని పరిశీలించి రెండు ప్రాంతాల్లోనూ ఒకే నిందితులు చోరీలు చేసినట్లు గుర్తించి అదే అభిప్రాయానికి వచ్చారు. ఆదివారం అందిన సమాచారం ప్రకారం నేరస్తుల ముఠాలోని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి మధ్యప్రదేశ్ కు చెందిన పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed