మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి రూ. 30 లక్షలు: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

by Disha Web Desk 11 |
మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి రూ. 30 లక్షలు: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కోసం రూ. 30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కాటారం మండల మున్నూరు కాపు సంఘం నాయకులు కలిసి భవన నిర్మాణం కోసం విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం భవనం కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గారేపల్లి గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి రూ. ఐదు లక్షలు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో కాటారం మండల పరిషత్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొట్టే శ్రీహరి, నాయకులు కొట్టే శ్రీశైలం, మాదేవపూర్ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, తడకల జగదీష్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed