బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటా : ఈసం స్వామి

by Disha Web Desk 20 |
బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటా : ఈసం స్వామి
X

దిశ, కొత్తగూడ : మండలంలోని బత్తులపల్లి గ్రామంలో పశువుల దాడిలో గాయపడి మరణించిన మహబూబి కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం నాయకులు ఈసం స్వామి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి యాభై (50) కిలోల బియ్యం, రూ.5000/- ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్బంగా ఈసం స్వామి మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానంటూ భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎట్టి సర్వయ్య, తుర్శ నర్సయ్య, ఈసం సారంగపాణి, ఇరుప నారాయణ, ఎట్టి లక్ష్మయ్య, ఈసం రంగారావు, ఈసం పాపారావు, జనగం సారయ్య, జాడి శ్రీను, పాయిరి అశోక్, తాటి భద్రయ్య, తాటి లక్ష్మయ్య, ఎట్టి రామయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed