- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, జనగామ : జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న మాలోత్ హుస్సేన్ నాయక్ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలు పరిశీలిస్తే 33 కేవీ లైన్ షిఫ్టింగ్ కోసం రైతు కుంభం ఎల్లయ్య రూ.16 లక్షల డీడీ కట్టాడు. అయితే డీడీ కట్టిన తర్వాత కూడా రెండు నెలలు అధికారుల చుట్టూ తిప్పించు కొని ఇబ్బంది పెట్టారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పని చేయాలంటే రూ.20వేలు లంచం ఇవ్వాలని డీఈ హుస్సేన్ నాయక్ అడిగారని వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించినట్లుగా ఎల్లయ్య తెలిపారు. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Next Story






