- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య
by Bhanu |
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో విషాదం నెలకొంది.

X
దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో విషాదం నెలకొంది. గత నాలుగు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న తోర్రికొండ రాజవ్వ (76) అనే వృద్ధురాలు ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. తన ఆరోగ్యం మెరుగుపడదనే బెంగతో మనస్థాపానికి గురైన ఆమె, గ్రామంలోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది.
మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు మానకొండూరు సీఐ సంజీవ్ కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అన్నారం గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మృతురాలికి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
Next Story






