బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మాయ మాటలు నమ్మొద్దు : హుస్సేన్ నాయక్

by Disha Web Desk 23 |
బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మాయ మాటలు నమ్మొద్దు : హుస్సేన్ నాయక్
X

దిశ,గూడూరు: బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మాయమాటలు ఎవరు నమ్మొద్దు అని, నేను స్థానిక బిడ్డ ను.. ఒక్క అవకాశం ఇవ్వండి అని బీజేపీ మహబూబాబాద్ నియోజకవర్గ అభ్యర్థి హుస్సేన్ నాయక్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు గూడూరు మండలం లో రాములు తండా,సాంబయ్య పల్లి, చిర్రకుంట తండా మరియు పడమటి తండ, గుండెంగా మదనాపురం గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వంపై అసహనంతో, వ్యతిరేకతతో ఉన్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే మానుకోట ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళిత బంధు, బీసీ బంధు వంటి అనేక పథకాలు కేవలం బీఆర్ఎస్ నాయకులు మరియు వారి అనుచరులకు మాత్రమే ఇచ్చారని , నిజమైన నిరుపేద ప్రజలకు ఇవి అందడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి గ్రామాల్లో ఏమీ కనిపించడం లేదన్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వారికి అందుబాటులో లేకుండా పోయాడన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోతిలాల్ జిల్లా నాయకులు మాజీ జడ్పీటీసీ నాయిని ధర్మ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మేరెడ్డి సురేందర్ సీనియర్ నాయకులు సమ్మెట సుధాకర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరవింద్,శక్తి కేంద్ర ఇంఛార్జి చీకటి కిరణ్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ నాయక్,బూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, జాటోతు శ్రీధర్,బొడ కళ్యాణ్,మండల ప్రధాన కార్యదర్శి రాస మల్ల వెంకన్న,గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంబాబు,గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు బోడ నవీన్ నాయక్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed