ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ టోర్నీకి సీఐ శ్రీనివాస్ ఎంపిక

by Dishanational1 |
ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ టోర్నీకి సీఐ శ్రీనివాస్ ఎంపిక
X

దిశ, మహబూబాబాద్ టౌన్: షటిల్ బ్యాడ్మింటన్ విభాగంలో ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2022 క్రీడోత్సవాలకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్ ఎంపికయిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పర్ లోయర్, ట్రాక్ టీ-షర్ట్ మరియు షూస్ అందించి అభినందించారు. తెలంగాణ పోలీస్ శాఖ తరుపున ఎంపికై చండిఘడ్ లో ఈ నెల 20 నుండి 26 వరకు జరగనున్న అల్ ఇండియా పోలీస్ క్రీడోత్సవాలలో సీఐ శ్రీనివాస్ పాల్గొననున్నారు.


Next Story

Most Viewed