కాకతీయ యూనివర్సిటీలో 45 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్..

by Disha Web Desk 20 |
కాకతీయ యూనివర్సిటీలో 45 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్..
X

దిశ, కేయూ క్యాంపస్ : హైదరాబాద్ లోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ పాల్టెక్ కాకతీయ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల కంప్యూటర్ బేస్డ్, వ్రాత పూర్వక ప్రాధమిక పరీక్షల్లో 112 మంది ఇంజనీరింగ్ చివరి సంవత్సర విద్యార్థులు పాల్గొనగా వారిలో 45మంది విద్యార్థులు చివరి రౌండ్ పరీక్షకు అర్హత సాదించినట్టు తెలిపారు.

వీరికి కోడింగ్, విషయ పరిజ్ఞానం పై పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియ చేపడతామని నిర్వాహకులు అగ్నిజొన్నలగడ్డ, కార్తీక్ కస్తూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల నుంచి డాక్టర్ వి.మహేందర్, వేణుగోపాల్ రెడ్డితో పాటు ఒప్పంద అధ్యాపకులు ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ రమణ బాబు, లక్ష్మణ్ నాయక్, శ్రీలత, వాణి, రాజేశ్వరి, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed