కేసముద్రంలో దారుణ హత్య..అత్త మామ‌ల‌పైనే అనుమానాలు !

by velandi.Saikiran |

కేసముద్రంలో దారుణ హత్య జ‌రిగింది.

కేసముద్రంలో దారుణ హత్య..అత్త మామ‌ల‌పైనే అనుమానాలు !
X

దిశ, కేసముద్రం: మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత అల్లుడు నరేష్‌ను అతని అత్తమామలు కంకల కుమారస్వామి, కళమ్మ హత్య చేసినట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, నరేష్ భార్య అనూషకు సంబంధించి ఓ వివాదం రాజుకుంది. ఈ త‌రుణంలోనే న‌రేష్, అత్తమామలకు ఘర్షణ జ‌రిగింది. ఇంత‌లోనే నరేష్ హత్య జ‌రిగింది. దీంతో అత్తమామలు కంకల కుమారస్వామి, కళమ్మ హత్య చేసినట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి. ఈ ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. హత్యకు గల అసలు కారణాలు, నిందితుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. ఈ సంఘ‌ట‌న‌పై వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story