అవగాహన లేక.. టీఆర్ఎస్ అసత్య ప్రచారాలు: రావు పద్మ

by Web Desk |
అవగాహన లేక.. టీఆర్ఎస్ అసత్య ప్రచారాలు: రావు పద్మ
X

దిశ, హన్మకొండ టౌన్: కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ నిధులతో హన్మకొండ జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులు చేస్తూనే, స్థానిక ప్రజాప్రతినిధులు అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మండిపడ్డారు. ఆదివారం సమ్మయ్య నగర్ వద్ద 80 ఫీట్ల రోడ్‌పై స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న అధివృద్ధి పనులను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఈఈ హర్షవర్ధన్ పనుల వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసత్యాలు ప్రచారం చేయడంలో వరంగల్ టీఆర్ఎస్ నేతలు నెంబర్ వన్ అని అన్నారు. సోషల్ మీడియా యుగంలో రాష్ట్ర ప్రభుత్వ అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థతిలో లేరని దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎం చేసింది అని ప్రశ్నించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కి హన్మకొండ నగరంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇకనుండి కేంద్ర నిధుల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలిసేలా ప్రచారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, జిల్లా నాయకులు దేశిని సదానందం గౌడ్, అర్పీ జయంత్ లాల్, గండ్రతి శ్రీనివాస్, కేతిరెడ్డి విజయలక్ష్మీ, రవీందర్ రెడ్డి, గంట దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొ్న్నారు.


Next Story

Most Viewed