బైక్ అదుపుతప్పి ప్రమాదం.. వ్యక్తి మృతి

by Bhanu |

మండలంలోని పడమటి కేశపూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించాడు.

బైక్ అదుపుతప్పి ప్రమాదం.. వ్యక్తి మృతి
X

దిశా,బచ్చన్నపేట: మండలంలోని పడమటి కేశపూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించాడు. ప్రమాద సంఘటన గూర్చి బచ్చన్నపేట ఎస్సై ఎస్కే హామీద్ వివరాలు తెలియజేశారు. పడమటి కేశపురం గ్రామంలో హనుమాన్ పేట వద్ద బోడపట్ల వెంకటయ్య, తండ్రి. రామయ్య వయసు 47, నివాసం పాముకుంట, మండల రాజాపేట. రాజాపేట నుండి చేర్యాలకు తన ద్విచక్ర వాహనం ఫ్యాషన్ ప్రో టీఎస్ 07GZ2954 వెళుతుండగా హనుమాన్ పేట్ క్రాస్ వద్ద తన ద్విచక్ర వాహనం నుండి అదుపుతప్పి గుంతలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బచ్చన్నపేట ఎస్సై తెలిపారు.


Next Story