గ్రామసభలో బీఆర్ఎస్ సర్పంచ్ పై దాడి..

by Disha Web Desk 20 |
గ్రామసభలో బీఆర్ఎస్ సర్పంచ్ పై దాడి..
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కంబాలపల్లి గ్రామ శివారు మోట్లతండాలో బీఆర్ఎస్ సర్పంచ్ సుమన్ పై కొంత మంది వ్యక్తులు చెప్పుతో దాడి చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాలలోకి వెళ్లితే బుధవారం మోట్లతండాలో ప్రతినెల మాదిరిగానే మే నెలలో కూడా గ్రామసభ నిర్వహించారు. కాగా కొంతమంది సభ్యులు గ్రామంలో ఎలాంటి అభివృద్ది జరగడం లేదంటూ రసాభాస చేశారు. అంతటితో ఆగకుండా ఇదే గ్రామపంచాయితీ పరిధికి చెందిన ముగ్గురు వ్యక్తులు సర్పంచ్ ను చెప్పుతో కొట్టారు. గ్రామానికి అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. ఈ విషయమై సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో తనకు వస్తున్నఆదరణ చూడలేక, రాజకీయంగా ఎదురుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడితున్నట్లు ఆయన తెలిపారు.


Next Story

Most Viewed