ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య?

by Dishanational2 |
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య?
X

దిశ, నర్సంపేట: నర్సంపేట మండలంలోని కమ్మపల్లిలో జన్ను అనిల్ (35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు అనిల్ స్వగ్రామం చెన్నారావుపేట మండలం కోనాపురంగా తెలుస్తున్నది. తన అక్క ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మానసిక ఆవేదనతోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా అనిల్ మృతిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.



Next Story

Most Viewed