వివాహిత ఆత్మహత్య..బావిలో దూకి !

by velandi.Saikiran |

వివాహిత ఆత్మహత్య..బావిలో దూకి !
X

దిశ, నర్సంపేట: కుటుంబ కలహాలతో ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సంపేట మండలంలోని బాంజీపేట శివారు నర్సినాయక్ తండాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలతో విసిగిపోయిన భూక్యా సునీత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.సునీత మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తులు సునీత మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం పోలీసుల విచారణ అనంతరం తేలనుంది.

Next Story