సైకిల్ ను ఢీకొట్టిన ట్రాక్టర్.. బాలుడు మృతి, మరో బాలుడికి తీవ్ర గాయాలు..

by Disha Web Desk 11 |
సైకిల్ ను ఢీకొట్టిన ట్రాక్టర్.. బాలుడు మృతి, మరో బాలుడికి తీవ్ర గాయాలు..
X

దిశ, గూడూరు: సైకిల్ ను ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా మరో బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టేవాడ గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మట్టేవాడ గ్రామానికి చెందిన వాసం వర్షిత్ కుమార్(12), తన స్నేహితుడు అయిన అరెం నవదీప్ తో కలిసి గ్రామంలో సైకిల్ పై ప్రయాణిస్తున్న క్రమంలో అదే గ్రామంలో మొరం తరలిస్తున్న ట్రాక్టర్ సైకిల్ ను ఢీకొట్టడంతో వర్షిత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. నవదీప్ కు తీవ్ర గాయాలు కావడంతో మహబుబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story