పండగ పూట విషాదం చేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి

by Disha Web Desk 9 |
పండగ పూట విషాదం చేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి
X

దిశ, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామానికి చెందిన పొడుగు రాఘవులు(45) అనే రైతు చెరువులో చేపల వేట కు వెళ్లి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... రాఘవులు కుటుంబం చేపలు పట్టుకొని జీవనం కొనసాగిస్తుంటారు. రోజు లాగానే ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం గత 2 రోజులుగా ఎక్కడ వెతికినా దొరకలేదు. బుధవారం ఉదయం గ్రామ చెరువులో అతని మృతదేహం తెలడంతో గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పండగ పూట విషాదం జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed