- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొలెరో వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి..
by Taduka Kalyani |
మహబూబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన గుండా రాంరెడ్డి (57)ని బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది.

X
దిశ, గార్ల: మహబూబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన గుండా రాంరెడ్డి (57)ని బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. ఎస్ఐ బానోత్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన రాంరెడ్డి పాలు పోసేందుకు రాంపురం నుంచి పులిగుట్ట తండాకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బొలెరో వాహనం డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ఢీకొట్టడంతో రాంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు గుండా ఉపేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






