ఆత్మహత్య చేసుకుంటానని సెల్ టవర్ ఎక్కిన రైతు.. కారణం ఏమిటంటే ?

by Dishanational2 |
ఆత్మహత్య చేసుకుంటానని సెల్ టవర్ ఎక్కిన రైతు.. కారణం ఏమిటంటే ?
X

దిశ, నెల్లికుదురు : ఆత్మహత్య చేసుకుంటానని ఓ రైతు సెల్ టవర్ ఎక్కిన ఘటన మండలంలోని చిన్న నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. పంజాల రమేష్ అనే రైతు ఆత్మహత్య చేసుకుటానని సెల్ టవర్ ఎక్కాడు. దీంతో కొంతమంది ఆత్మహత్యకు గల కారణాలు ఏంటని ఫోన్ చేసి అడుగగా, తాను 40 సంవత్సరాలు కొన్న భూమిని, మాది అంటూ కొందరు వ్యక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అలాగే రెవెన్యూ అధికారులు, పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారని, తమకు న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed