మాద‌క ద్ర‌వ్యాల ర‌హిత స‌మాజాన్ని స్థాపించాలి : డీఎస్పీ ర‌మేష్

by Ratna Kumari |

మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని స్థాపించాలని నార్కోటిక్ వింగ్ డీఎస్పీ రమేష్ అన్నారు.

మాద‌క ద్ర‌వ్యాల ర‌హిత స‌మాజాన్ని స్థాపించాలి : డీఎస్పీ ర‌మేష్
X

దిశ, గీసుకొండ : మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని స్థాపించాలని నార్కోటిక్ వింగ్ డీఎస్పీ రమేష్ అన్నారు. మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని ధర్మారం హై స్కూల్ లో నిర్వహించి విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలన కు ప్రతిజ్ఞ చేపించారు. డీఎస్పీ రమేష్ పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు ను గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఎవ్వరు కూడా ఇలాంటి వ్యసనాలకు బానిసలు కావొద్దని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన యువత తోనే సాద్యం అవుతుందన్నారు. ఏంఈవో రవీందర్, ఎమ్మార్వో రియాజుద్దీన్, సీఐ విశ్వేశ్వర్, ఎస్సై అనిల్, పాఠశాల ఉపాధ్యాలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story