- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పోరాటం మానేసి ప్రజా జీవితానికి చేరువ... తెలంగాణలో లొంగిన మావోయిస్టులు!

దిశ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలోని నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న 14 మంది సభ్యులు గురువారం వరంగల్ కమీషనరేట్ లో మల్టీ జోన్ - 1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐ జి పి ) ఎస్. చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఇందులో రెండు ఏరియా కమిటీ సభ్యులు, ఏడుగురు పార్టీ సభ్యులు, ఒక మిలిషియా కమాండర్, నలుగురు మిలిషియా కార్యకర్తలు ఉన్నారు. వీరిలో గాలికొండ ఏరియా కమిటీకి చెందిన మడవి అంద ( రాజేష్ ), కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి ( ఉదయ్) కు చెందిన ప్రొటెక్షన్ టీం లో పనిచేసిన సోడి కోసి వంటి కీలక నేతలు ఉన్నారు.
ఈ లొంగుబాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోరు కన్నా ఊరు మిన్న, ఆపరేషన్ చేయూత వంటి పునరావాస కార్యక్రమాల ప్రభావం ఉంది, మావోయిస్టు సభ్యులు హింసాత్మక మార్గాన్ని వదిలి సామాన్య జీవితాన్ని ప్రారంభించాలనే సంకల్పంతో ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐ జి పి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎదురు కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు, అందులో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు చనిపోగా, 2025లో ఇప్పటివరకు 12 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం. అలాగే మొత్తం 250 మంది లొంగిపోయారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సరెండర్ పాలసీ ద్వారా లొంగుబాటు చేసిన వారికి పలు రకాల పునరావాస సదుపాయాలు కల్పిస్తున్నదని ఆయన తెలిపారు. ఇందులో రివార్డు డబ్బులు వెంటనే ఇవ్వడం, వైద్య చికిత్స, పునరావాస సహాయం, శాశ్వత మద్దతు వంటి సౌకర్యాలు ఉన్నాయి. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు క్యాడర్లకు పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తూ, వారిని సామాజిక జీవనధారలో కలవాలని కోరింది.