వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

by Disha Web Desk 12 |
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానం కాలీ కావడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఇప్పటికి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా అశోక్ పోటీలో ఉన్నారు. ఈ రోజు బీజేపీ తమ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. కాగా మే 2 ఈ నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణకు, 10 పరిశీలన, 13న ఉపసంహరణకు చివరి తేదీలుగా ప్రకటించింది. కాగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు వరకు జరగనుండగా.. జూన్ 5న కౌంటింగ్ ఉంటుంది.

Next Story