- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన వికాస్ మంచ్
by Javid Pasha |
కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు చేయాలంటూ వికాస్ మంచ్ హైకోర్టును ఆశ్రయించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ ఎన్నికలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలు రద్దు చేయాలంటూ వికాస్ మంచ్ నేతలు సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. సివిల్ ప్రాంతాల విలీనంపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు, రక్షణ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది. కాగా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30న కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
Next Story






