జనజీవన స్రవంతిలోకి వేణుగోపాల్.. అన్న కొడుకు మల్లోజుల దిలీప్ రియాక్షన్ ఇదే

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-14 09:12:32  IST  )

సీపీఐ (మావోయిస్టు) పార్టీ నేత మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) ఇవాళ గడ్చిరోలి (Gadchiroli) పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు.

జనజీవన స్రవంతిలోకి వేణుగోపాల్.. అన్న కొడుకు మల్లోజుల దిలీప్ రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ (మావోయిస్టు) పార్టీ నేత మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) ఇవాళ గడ్చిరోలి (Gadchiroli) పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సరెండర్‌పై వేణుగోపాల్ సోదరుడి కుమారుడు మల్లోజుల దిలీప్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. మా బాబాయ్ తిరిగి జనజీవన స్రవంతిలోకి తిరిగి రావడం సంతోషకరమని అన్నారు. బాబాయ్ పిల్లలు, కుటుంబ ప్రేమను దూరం చేసుకుని కొన్నేళ్లుగా నిస్వార్థంగా నమ్మిన సిద్ధాంతాలు, ఆశయాల కోసం పని చేసేశారని కొనియాడారు. తమ నానమ్మ (వేణుగోపాల్ తల్లి) సంవత్సరాల తరబడి కొడుకు కోసం వేచి చూసిందని, చివరకు 2022లో ఆమె కన్నుమూశారని మల్లోజుల దిలీప్ ఎమోషనల్ అయ్యారు.

Next Story