- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాట మళ్లీ ఎన్నికలు, బెంగాల్ లో రాష్ట్రపతి పాలన.. వేణుస్వామి సంచలన జోస్యం
వేణుస్వామి పరిచయం అక్కర్లేని పేరు. సినిమా తారలు, రాజకీయనాయకుల జాతకాలు చెబుతూ వేణు స్వామి తరచూ వార్తల్లో నిలుస్తారన్న సంగతి తెలిసిందే. సమంత నాగచైతన్య విడాకులతో అనేక విషయాలపై వేణుస్వామి జోస్యం చెప్పి వేణు స్వామి అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో ట్రెండింగ్ లో ఉంటారు.

దిశ, వెబ్ డెస్క్: వేణుస్వామి పరిచయం అక్కర్లేని పేరు. సినిమా తారలు, రాజకీయనాయకుల జాతకాలు చెబుతూ వేణు స్వామి తరచూ వార్తల్లో నిలుస్తారన్న సంగతి తెలిసిందే. సమంత నాగచైతన్య విడాకులతో అనేక విషయాలపై వేణుస్వామి జోస్యం చెప్పి వేణు స్వామి అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో ట్రెండింగ్ లో ఉంటారు. అప్పట్లో జాతకాలు చెప్పడం ఆపేసానని ప్రకటన చేసినా కేవలం అది ప్రకటన వరకే మిగిలిపోయింది. ఇక ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న తమిళనాడు, బెంగాల్ రాజకీయాలపై వేణుస్వామి తనదైన జోస్యం చెప్పి మరోసారి వార్తల్లో నిలిచాడు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడిన తరవాత మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నాడు.
అంతేకాకుండా పశ్చిమబెంగాల్లో బీజేపీ ఘనవిజయం సాధించినప్పటికీ అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని అన్నారు. మే 25 నుండి జూన్ 2 వరకు గురువు మార్పు కనిపిస్తుందని, మిథున రాశి నుండి కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి వెళ్లనున్నట్టు తెలిపారు. గురువు అతిచారంలోకి వెళుతుందని అన్నారు. దాంతో పెను సంచలనాలు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. దానివల్లనే పశ్చిమబెంగాల్, తమిళనాడులో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేశారు.
ఇక విజయ్ జాతకం దృష్ట్యా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని రోజులకు ఆ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు రావడం ఖాయం అని చెప్పారు. విజయ్, త్రిషది ఏకనాడి కాంబినేషన్ అని త్రిష లేకపోతే ఎన్నికల్లో విజయ్ ఫలితం మరోలా ఉండేదని అన్నారు. తమిళనాడు రాష్ట్ర జాతకం చూసినా విజయ్ సీఎం అయినప్పటికీ మళ్లీ ఎన్నికలు వస్తాయని షాకింగ్ కామెంట్స్ చేశాడు. గురువు మార్పు వల్ల తమిళనాడు ప్రభుత్వంలో అస్థిరత ఉంటుందని వెల్లడించారు. మరో నెల, ఆరు నెలలు, ఏడాదిలోపే ఇది జరుగుతుందని వేణుస్వామి బాంబు పేల్చారు.






