- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన వట్టే జానయ్య
by Prasad Jukanti |
ఫోన్ ట్యాపింగ్ కేసులో వట్టెజానయ్య స్టేట్ మెంట్ రికార్డు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇవాళ బీసీ నేత వట్టే జానయ్య (Vatte Janaiah) విచారణకు హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేశారు. ఎన్నికలప్పుడు వట్టే జాన్యయ ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయనను సిట్ అధికారులు విచారణకు పిలవగా ఇవాళ ఇవాళ దర్యాప్తు అధికారుల ముందు హాజరైన వట్టే జానయ్య నుంచి అధికారులు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కాగా ఈ కేసులో ఇవాళ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరోసారి సిట్ ముందు హాజరు కానున్నారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆయనను మరోసారి ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది.
Next Story






