- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైడ్రాతో ప్రభుత్వం రూ.15వేల కోట్ల విలువైన ఆస్తులను కాపాడింది: వి. హన్మంత రావు
by Ajay Maddhiboyina |
హైడ్రాతో హైదరాబాద్ లో 15వేల కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం కాపాడిందని మాజీ ఎంపీ వి. హన్మంత రావు అన్నారు. కానీ ప్రతి పక్షాలు మాత్రం తట్టుకోలేక పేదోళ్ల ఆస్తులు కూలగొడుతున్నారని విమర్శిస్తున్నారని మీడియా సమావేశంలో మండిపడ్డారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : హైడ్రాతో హైదరాబాద్ లో 15వేల కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం కాపాడిందని మాజీ ఎంపీ వి. హన్మంత రావు అన్నారు. కానీ ప్రతి పక్షాలు మాత్రం తట్టుకోలేక పేదోళ్ల ఆస్తులు కూలగొడుతున్నారని విమర్శిస్తున్నారని మీడియా సమావేశంలో మండిపడ్డారు. పేదోళ్ల ఇండ్లు కులగొడితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, హైడ్రాకు ఇంకా ఎక్కువ పవర్స్ ఇస్తే ఇందిరా గాంధీ ఇచ్చిన అసైన్డ్ కబ్జా భూములు చాలా బయటకు వస్తాయన్నారు. నిజాం వదిలేసి పోయిన భూములు కూడా కబ్జా అయ్యాయని, వాటిని కూడా కాపాడాలని హన్మంతరావు ప్రభుత్వానికి సూచించారు.
Next Story






