తెలంగాణ ప్రజలకు యూపీ CM యోగి బంపరాఫర్

by Disha Web Desk 19 |
తెలంగాణ ప్రజలకు యూపీ CM యోగి బంపరాఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బంపరాఫర్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సీఎం యోగి వేములవాడలో బీజేపీ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ప్రతిష్టాత్మక అయోధ్య దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ మద్దతుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని యోగి ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున దోపిడికి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ పవర్ లోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని ఆదివాసీలు, వెనుకబడిన వారికి ఇస్తామని ప్రకటించారు. మేం ఎవరిపైనా దాడి చేయం.. దాడికి వస్తే విడిచిపెట్టమని యోగి వార్నింగ్ ఇచ్చారు.



Next Story

Most Viewed