- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలోని ఆ ప్రాంతంలో అకాల వర్షం.. రైతుల్లో టెన్షన్
by GSrikanth |
నిర్మల్ జిల్లాలోని భైంసాలో అకాల వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం తానూర్, ముధోల్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

X
దిశ, వెబ్డెస్క్: నిర్మల్ జిల్లాలోని భైంసాలో అకాల వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం తానూర్, ముధోల్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో రైతుల్లో టెన్షన్ మొదలైంది. ఆరు గాలం శ్రమించి పండించిన పంట చేతికందుతున్న వేళ అకాలవర్షం కురవడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. వర్షంతో పలుచోట్ల వరి పనలు నేలకు ఒరిగినట్లు సమాచారం. అయితే, వాతావరణంలో తరచూ జరుగుతున్న మార్పులు రైతులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రతిఏటా పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడం, రైతులు నష్టపోవడం జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ముందుగానే నాట్లు వేసినా ఆకాలవర్షాల బారిన పడే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు మామిడి రైతులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. వేసవి రీత్య పంట చేతికొచ్చే సమయం ఇది. ఈ తరుణంలో వర్షం వారిని కంగారు పెట్టింది.
Next Story






