ఎంఎంటీఎస్ రైలు ప్రమాద బాధితురాలిని పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Ramesh Goud |   ( Updated:2025-03-29 17:07:50.0  )
ఎంఎంటీఎస్ రైలు ప్రమాద బాధితురాలిని పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఎంఎంటీఎస్ ట్రైన్ అత్యాచారయత్నం ఘటన (MMTS Train Incident)లో బాధితురాలిని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పరామర్శించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి (Secunderabad Yashoda Hospital) కి వెళ్లిన కిషన్ రెడ్డి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు అప్రోజాను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితి (Health Condition)పై డాక్టర్లను ఆరా తీశారు. ప్రస్తుతం అప్రోజా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో, తనకు సౌకర్యవంతంగా ఉండేందుకు తన సొంత ఊరిలోనే అవసరమయ్యే వైద్యాన్ని, వైద్యానికి అయ్యే ఖర్చుని పూర్తిగా తామే భరిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఆమెకు అండగా ఉంటామని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు.

అంతేగాక రైల్వే డీజీ (Railway DG) తో మాట్లాడి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం అప్రోజా అనే యువతి రాత్రి సమయంలో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ (Secunderabad To Medchal) వెళ్లేందుకు ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ఆమెపై అత్యచార యత్నానికి ఒడిగట్టాడు. ఆ దుర్మార్గుడి నుంచి తప్పించుకునేందుకు యువతి భయంతో కదులుతున్న రైలు నుంచి దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.



Next Story

Most Viewed