భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తల వేళ.. తెలుగు ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక విజ్ఞప్తి

by Ramesh N |
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తల వేళ.. తెలుగు ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రక్షణ, సమగ్రత కోసం పాకిస్తాన్‌తో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న భారత సైనికులకు అండగా నిలబడటం మనందరి బాధ్యత అని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ వద్ద ఉన్న కనక దుర్గ ఆలయం ప్రత్యేక పూజలు చేశారు. మన సరిహద్దులను రక్షించడానికి, దాడులను తిప్పికొట్టడానికి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ప్రతి పౌరుడిని రక్షించడానికి ప్రతి ధైర్యవంతుడికి మరింత బలం, శక్తి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు భారత సైన్యం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ.. ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్న పాకిస్థాన్‌లోని అనేక ప్రాంతాలకు వెళ్లి బుద్ధి చెబుతోందని పేర్కొన్నారు. భారత్‌లోని పౌర ప్రాంతాలపై పాక్ చేస్తున్న దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోందన్నారు.

ఈ సందర్భంగా భారత త్రివిధ దళాలకు మానసికంగా అండగా నిలబడేందుకు అన్ని దేవాలయాల్లో పూజలు చేయాల్సిందిగా తెలుగు ప్రజలను కోరారు. సైనికులకు మద్దతుగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. కాగా, (India-Pakistan) భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ తిప్పి కొడుతోంది. (Operation Sindoor) ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టిన తర్వాత పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. (Indian Army) భారత సైన్యాన్ని నేరుగా ఎదుర్కోలేమని గ్రహించిన పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది.



Next Story

Most Viewed