- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD Metro: మెట్రో ఫేజ్ 2 డీపీఆర్ ఇటీవలే అందింది: మనోహర్ లాల్ ఖట్టర్
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) అన్నారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) మనోహర్ లాల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితి గురించి ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు సంబంధించి ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. మెట్రో ఫేజ్ -2 కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన డీపీఆర్ ఇటీవలే తమకు అందిందని ఖట్టర్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ డీపీఆర్ ను మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని ఖట్టర్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మెరుగైన కనెక్టివిటితో ఆధునిక హైదరాబాద్ నగర అభివృద్ధి, తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు ఖట్టర్ పేర్కొన్నారు.






