- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తక్షణమే రోస్టర్ పాయింట్లు సవరించాలి: అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన
మాలల రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్న రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ జై భీమ్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

దిశ, హిమాయత్ నగర్: మాలల రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్న రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ జై భీమ్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులోని లోయర్ ట్యాంక్ బండ్ డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సుధమల్ల అంజలీ, దాసరి విశాల్ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథులుగా మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డా.మంచాల లింగస్వామి, ది నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నే శ్రీధర్, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాడారం వినయ్ కుమార్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల గ్రూపు-3 లో ఉన్న మాల, ఇతర 25 కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
రాబోయే రోజుల్లో మాలలందరినీ...
గ్రూపు-3 మొదటి రోస్టర్ పాయింటు 22 వద్ద ఉండడంతో గత సంవత్సర కాలంగా వచ్చిన అనేక ఉద్యోగ నోటిఫికేషన్లలో మాల, ఇతర 25 కులాలకు ఉద్యోగాలే రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రోస్టర్ విధానాన్ని సవరించి గ్రూపు-3 మొదటి రోస్టర్ పాయింటును 22 నుండి 16 కి మార్చాలని , మాలలకు 50 లోపు మూడు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాబోయే రోజుల్లో మాలలందరినీ ఐక్యం చేసి కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు పుణ్య భానుప్రకాశ్, మాల ప్రజా ఫ్రంట్ కోఆర్డినేటర్ మేసే నాందేవ్, ది నేషనల్ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షులు తాలూకా రాజేష్, భుజంగ రావు, పెరుమాళ్ల సత్యనారాయణ, సుగుణ, సౌభాగ్య, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.






