కేటీఆర్‌ను CM చేయడమే కేసీఆర్ ఏకైక లక్ష్యం: కేంద్రమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
కేటీఆర్‌ను CM చేయడమే కేసీఆర్ ఏకైక లక్ష్యం: కేంద్రమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ జన గర్జన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పేదల కోసం పని చేయడం లేదని.. కేవలం కొడుకు, కూతురు కోసమే పని చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ ఏకైక లక్ష్యమని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈ పదేళ్లలో కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని ధ్వజమెత్తారు. గిరిజన యూనివర్శిటీకి పదేళ్లుగా కేసీఆర్ సర్కార్ స్థలం ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణను నెంబర్ 1 చేశానని చెబుతున్నాడని.. కానీ రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నేడు దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉందని మండిపడ్డారు.

మహిళలు, బాలికలపై అత్యాచారాల్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించి బీజేపీకి అధికారం ఇచ్చేందుకు పిడికిలి బిగిండచడని అమిత్ షా పిలుపునిచ్చారు. నేటి తరం రజాకర్ల నుండి తెలంగాణను రక్షించేంది బీజేపీ మాత్రమేనని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నం అయిందన్నారు. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని అమిత్ షా జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed