కేసీఆర్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలు.. : మధు యాష్కీ గౌడ్

by Disha Web Desk 9 |
కేసీఆర్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలు.. : మధు యాష్కీ గౌడ్
X

దిశ ,తెలంగాణ బ్యూరో: కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్ తో స్వరాష్ట్రం ఏర్పాటు చేస్తే.. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల రూపాయల అప్పల్లో మునిగిపోయిందని సాక్ష్యాత్తు కాగ్ చెబుతోందన్నారు.బడ్జెట్ రుణాలు, గ్యారంటీలు కలిసి రాష్ట్రాన్ని నిట్టనిలువునా అప్పుల్లో ముంచేశాయన్నారు.

తెచ్చిన అప్పులు ఏ కలుగులో ఉన్నాయో.. ఎవరి బొక్కసంలో భద్రంగా ఉన్నాయో ప్రజలంతా అర్థం చేసుకోవాల్సి న అవసరం ఉన్నదన్నారు. ఇవన్నీ ప్రగతి భవన్ నేలమాళిగలో దాక్కున్నాయని చెప్పారు. కాబట్టే దేశమంతా ఎన్నికల ఖర్చును భరిస్తాననే స్థాయికి కేసీఆర్ అవినీతి చేరిందన్నారు. తెలంగాణ వచ్చినప్పటినుంచి గత తొమ్మిదిన్నర ఏళ్లుగా తెలంగాణ ప్రజలని తాగుడుకు బానిసలు చేసి.. రక్తమాంసాలను సైతం పీక్కుతిని 2 లక్షల కోట్ల రూపాయాలుగా మార్చుకున్నాడని తెలిపారు. అసరా పింఛన్ల రూపంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విదిల్చిన ముష్టి కేవలం 68 వేల కోట్ల రూపాయాలు మాత్రమే నని క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిట్టనిలువునా చంపేసి.. కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందళ్ల వంటి మూడు చెక్ డ్యాములు కట్టి.. లక్ష కోట్ల రూపాయాలను కేసీఆర్ దోచేశాడన్నారు. కాళ్లేశ్వరం నీళ్లు అని చెబుతున్న కేసీఆర్.. ఆ ప్రాజెక్టుకు సంబంధించి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, పొలాలకు నీళ్లు తీసుకెళ్లే డిస్టిబ్యూటరీ కెనాల్స్ ను ఎక్కడైనా ఏర్పాటు చేశాడా? అని ప్రశ్నించారు." తెలంగాణ భూములకు పారుతున్న నీళ్లన్నీ నాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు, వాటికి తవ్విన కాలువల ద్వారా మాత్రమే అని నేను స్పష్టంగా చెబుతున్నాను. రాష్ట్రాన్ని ఆర్థిక వినానం వైపు తీసుకెళ్లిన్న పొలిటికల్ టెర్రరిస్ట్ కేసీఆర్ కు తెలంగాణ బిడ్డలు వచ్చే ఎన్నికల్లో మర్చిపోలేని గుణపాఠం చెబుతారు. "అంటూ మధు యాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు


Next Story

Most Viewed