- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Two people died due to lightning: పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి..
తెలంగాణలో పలు చోట్ల ఈదురుగాలులు, వడగల్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

X
దిశ వెబ్ డెస్క్: తెలంగాణలో పలు చోట్ల ఈదురుగాలులు, వడగల్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రామడుగు చంద్రయ్య అనే వ్యక్తి పిడుగుపాటుకు మృతి చెందాడు. అలానే వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్పల్లికు చెందిన కంబాల శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందారు.
కాగా ఈ ఘటనలో మరో ముగ్గురు గాయాపడ్డారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన భారీ వర్షాలకు రహదారుల పక్కన చెట్లు నేలకొరిగాయి. అలానే విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దానితో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కాగా పలు చోట్ల ఇండ్ల పై కప్పులు గాలికి కొట్టుకుపోయాయి.
Read More...
Next Story






