టీవీ ఛానల్ యాంకర్ కిడ్నాప్ కలకలం! పెళ్లి చేసుకోమని గదిలో బంధించిన యువతి

by Disha Web Desk 14 |
టీవీ ఛానల్ యాంకర్ కిడ్నాప్ కలకలం! పెళ్లి చేసుకోమని గదిలో బంధించిన యువతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఒక టీవీ ఛానెల్ యాంకర్‌ను త్రిష అనే యువతి కిడ్నాప్ చేసిందని తీవ్ర కలకలం రేపుతోంది. యాంకర్‌ను పెళ్లి చేసుకోవాలని భావించిన త్రిష కిడ్నాప్ చేయించిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 11న యాంకర్ ప్రణవ్‌ను కొందరు బంధించారని సిటీ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. ఈ క్రమంలోనే యాంకర్ ప్రణవ్ త్రిష నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి చేసుకోమని తనను గదిలో బంధించినట్టు యాంకర్ పోలీసులకు తెలిపారు. దీంతో కిడ్నాప్ చేయించిన నిందితురాలు త్రిషను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితురాలు త్రిష డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలు స్టార్ట్ అప్ కంపెనీలకు ఎండీగా, త్రిష కోట్లాది రూపాయలకు అధినేత్రి అని తెలుస్తోంది. మాట్రిమోని వెబ్‌సైట్‌లో ప్రణవ్ ఫోటోలు చూసి త్రిష ఇష్టపడింది. ప్రణవ్‌ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని త్రిష అతడిపై ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఉప్పల్ పోలీసులు త్రిషను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.



Next Story

Most Viewed