రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా.. టీటీడీపీ చీఫ్ కాసాని

by Dishafeatures2 |
రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా.. టీటీడీపీ చీఫ్ కాసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో : సకాలంలో వర్షాలుపడి రైతులతో పాటు ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆకాంక్షించారు. బోనాల పండుగ ను పురస్కరించుకొని నారా భువనేశ్వరి పాత బస్తీలోని లాల్ దర్వాజ సింహామహాని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మ వారికి పట్టు వస్త్రాలు పంపించగా అమ్మవారికి కాసాని ఆదివారం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలను చల్లంగా చూడాలని ప్రార్ధించారు. అమ్మవారికి తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి బోనం సమర్పించారు.

అదే విధంగా కాచిగూడ నింబోలి అడ్డ లొని మహంకాళి అమ్మవారికి జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న బోనం సమర్పించారు. కార్యక్రమంలో సాయి బాబా, బిల్డర్ ప్రవీణ్, పెద్దోజు రవీంద్రా చారి, ప్రకాశ్ , మేకల భిక్షపతి, ఆవుల భరత్ ప్రకాష్, రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ బియ్యని సురేష్, జోగేందర్ సింగ్, విజయ్ రాఠీ, కాసాని సాయి, జగదీశ్ యాదవ్,మాదాపూర్ రాజు, బండ్ల రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed