HYD: ఐపీఎల్ ప్రేక్షకులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్

by Disha Web Desk 2 |
HYD: ఐపీఎల్ ప్రేక్షకులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ మ్యాచ్ ప్రేక్షకులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. మ్యాచ్ కోసం ఆర్టీసీ అదనపు సేవలను నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల నుంచి ఉప్పల్‌ మార్గంలో మొత్తం 60 ప్రత్యేక సర్వీస్‌ను ఏర్పాటు చేసింది. ఇవి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియానికి వెళ్తాయి. మ్యాచ్‌ అనంతరం తిరుగు పయననమవుతాయి. క్రికెట్‌ అభిమానులు సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యతో ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి మ్యాచ్‌ను వీక్షించాలని అధికారులు సూచించారు.

అదేవిధంగా నాగోల్‌ - అమీర్‌పేట మెట్రో మార్గంలో కూడా అదనంగా రైళ్లు నడుపుతామని ఆ సంస్థ ప్రకటించింది. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడవనుందని. కాగా, ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఐపీఎల్ సీజల్ హైదరాబాద్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్ ఇది. హైదరాబాద్ - పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీగా తరలిరానున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.



Next Story

Most Viewed