ఇప్పటివరకు గ్రూప్-4కు ఎంత మంది అప్లై చేశారంటే!

by Dishanational4 |
ఇప్పటివరకు గ్రూప్-4కు ఎంత మంది అప్లై చేశారంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌పీ‌ఎస్సీ ద్వారా గ్రూప్-4 కింద విడుదల చేసిన పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది. గ్రూప్-4 ద్వారా దాదాపు 9,168 పోస్టుల భర్తీకి డిసెంబర్ 1న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే నిన్నటి వరకు (ఆదివారం) 2,48, 955 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నట్లు వెల్లడించింది. ఇక, డిసెంబర్ 30న ప్రారంభమైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 30న ముగుస్తుంది. మరో 20 రోజులు గడువు ఉండగా.. మరిన్ని అప్లికేషన్లు భారీగా పెరగడానికి అవకాశం ఉంది.

Next Story

Most Viewed