TSPSC : పేపర్ లీకేజీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్

by Disha Web Desk 4 |
TSPSC : పేపర్ లీకేజీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును విచారించేందుకు ఈడీ రంగంలోకి దిగనున్నట్లు తెలిసింది. ఈ అంశమై కేసు నమోదు చేసేందుకు ఈడీ ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. అయితే పేపర్ లీకేజీకి సంబంధించి తొలుగ బేగంబజార్ పీఎస్ లో కేసు నమోదైంది. ఆ తర్వాత దాన్ని సీసీఎస్ కు బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ ఈ కేసులో రంగంలోకి దిగనున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనుంది.


Next Story