టీఎస్ ఆర్టీసీ హెచ్చరిక.. ఎందుకంటే..?

by Disha Web Desk 14 |
టీఎస్ ఆర్టీసీ హెచ్చరిక.. ఎందుకంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒప్పందాలను ఉల్లంఘించి బకాయిలను ఎగవేసే సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీఎస్ ఆర్టీసీ హెచ్చరించింది. తమ బస్సుల్లో ప్రకటనల ఒప్పందం మేరకు చెల్లించాల్సిన రూ.21.73 కోట్లను మోసం చేసిన కేసులో ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ అరెస్ట్ కావాడాన్ని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం స్వాగతిస్తోంది.

హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో తిరిగే మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రకటనల కోసం గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీ 2015 సెప్టెంబర్ లో టీఎస్ ఆర్టీసీ తో ఒక ఒప్పందం కుదుర్చుకుందని, ఆరు ఏళ్లకు గాను 2021 సెప్టెంబర్ వరకు అగ్రిమెంట్ చేసుకుందని ఆర్టీసీ తెలిపింది. ఆ ఒప్పందం ప్రకారం సకాలంలో లైసెన్స్ ఫీజును ఆ సంస్థ చెల్లించలేదని, హైదరాబాద్ రీజియన్ లో రూ.10.75 కోట్లు, సికింద్రాబాద్ రీజియన్ లో రూ.10.98 కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొంది.

బకాయిలపై సమీక్ష

టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగ్ బకాయిలపై సమీక్ష జరిపారు. సకాలంలో లైసెన్స్ ఫీజు చెల్లించని సంస్థలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీకి పలుమార్లు లీగల్ నోటీసులను సంస్థ జారీ చేసింది.

ఆ నోటీసులకు స్పందించిన యాడ్ ఏజెన్సీ.. రూ.55 లక్షలకు ఇచ్చిన చెక్ లకు ఇచ్చింది. అవి చెల్లలేదు. ఈ మోసంపై అప్జల్ గంజ్, మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా టీఎస్ ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు బదిలీ అయింది. విచారణ చేపట్టిన దర్యాప్తు అధికారులు ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు.


Next Story

Most Viewed